మహిళలకు భద్రత కల్పిస్తాం: ప్రధాని
- Details
- Published on Monday, 24 December 2012 15:06
మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనల నేపథ్యంలో ఆయన సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబ సభ్యులు కూడా సానుభూతి తెలిపారన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ కుటుంబం ప్రార్థిస్తుందన్నారు.
జరిగిన దుర్ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నట్లు మన్మోహన్ పేర్కొన్నారు. ప్రజల ఆందోళన అర్థవంతమైనదేనని, అయితే హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసతో సాధించేది లేదని ప్రధాని అన్నారు. బాధితురాలిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మన్మోహన్ తెలిపారు.











