గాయని నిత్యశ్రీ ఆత్మహత్యాయత్నం
- Details
- Published on Thursday, 20 December 2012 17:19
ప్రముఖ కర్ణాటక సంగీత గాయని నిత్యశ్రీ భర్త మహాదేవన్(45) ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తూరుపురం బ్రిడ్జి నుంచి అడయార్ నదిలోకి దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిత్యశ్రీ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను బంధువులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే మహాదేవన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డీకే పట్టామ్మాల్ మనుమరాలైన నిత్యశ్రీ ప్రఖ్యాత గాయనిగా పేరు గాంచారు.











