డీసీ ఉద్యోగుల సమ్మె నోటీసు
- Details
- Published on Tuesday, 18 December 2012 12:57
డెక్కన్ క్రానికల్ కష్టాలు తీవ్రమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బోనస్ చెల్లింపులపై ఉద్యోగుల సంఘం నోటీసు ఇచ్చింది. సాధారణంగా డీసీలో డిసెంబరు ఒకటిన బోనస్ చెల్లిస్తారు. ఈసారి అలా చేయకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు. INTUC అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంజీవరెడ్డి ఈ సంఘానికి ముఖ్య పోషకుడిగా ఉన్నారు. ప్రస్తుతం కార్మిక శాఖ ద్వారా మేనేజ్మెంట్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన ఎకనామిక్ టైమ్స్తో చెప్పారు. సమస్య పరిష్కారానికి మరింత సమయం కావాలని మేనేజ్మెంట్ కోరుతున్నట్లు సంజీవరెడ్డి తెలిపారు. మరోవైపు కంపెనీ బోర్డుకు నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. వీరి స్థానంలో కొత్తగా ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్లను తీసుకున్నారు. ఈ ముగ్గురితో కలిపి ప్రస్తుతం కంపెనీ బోర్డులో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రమోటర్లు. పేర్లు.. వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డి, పి.కె.అయ్యర్. వీరు షేర్ల ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్నారు. దాదాపు 5 వేల కోట్ల రూపాయల రుణాలు డిఫాల్ట్ అయ్యారు. 100 కోట్ల రూపాయల గ్యారంటీ ఇవ్వలేక డెక్కన్ ఛార్జర్స్ను పోగొట్టుకున్నారు.












